మల్కాజిగిరి పీఎస్ కానిస్టేబుల్​ ఆత్మహత్య

మల్కాజిగిరి పీఎస్ కానిస్టేబుల్​ ఆత్మహత్య

యాచారం, వెలుగు: రంగారెడ్డి జిల్లా యాచారం పీఎస్ పరిధిలో కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నాడు. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన ఆర్ల వినోద్​కుమార్(27) మల్కాజిగిరి పోలీస్​స్టేషన్​లో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా సోరియాసిస్​ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​తీసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున వినోద్​కుమార్ ఇంట్లో ఉరేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న యాచారం పోలీసులు డెడ్​బాడీని హాస్పిటల్​కు తరలించారు.

పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనారోగ్యం కారణంగానే వినోద్​కుమార్ సూసైడ్ చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.