మంటల్లో వ్యాన్ దగ్ధం

మంటల్లో వ్యాన్ దగ్ధం

సికింద్రాబాద్, వెలుగు: మంటల్లో ఓమ్ని వ్యాన్ దగ్ధమైన ఘటన బేగంపేట పరిధిలో జరిగింది. సోమవారం బేగంపేటలోని ప్రకాశ్​నగర్ రోడ్ లో వెళ్తున్న ఓమ్ని వ్యాన్ ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెహికల్ ను పక్కకు నిలిపివేశాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అప్పటికే వ్యాన్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.