చెన్నై: హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలలోని ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నందున సిమెంట్ గిరాకీకి ఢోకా ఉండదని ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ వెల్లడించారు. మెట్రో సిటీలు, సెమి అర్బన్, అర్బన్ సెంటర్లలో నిర్మాణాలు జోరుగానే సాగుతున్నాయని పేర్కొన్నారు. కానీ, సిమెంట్ ప్రొడక్షన్ ఖర్చులే బాగా పెరుగుతున్నాయని చెప్పారు.
ఇండియా సిమెంట్స్ వర్చువల్గా నిర్వహించిన ఏజీఎంలో శ్రీనివాసన్ మాట్లాడారు. 2021–22 లో కన్స్ట్రక్షన్ సెక్టార్ రివైవ్ అయిందని, ఫలితంగా సిమెంట్ డిమాండ్ ఊపందుకుందని అన్నారు. థర్మల్ కోల్, పెట్ కోక్తోపాటు ఇతర ముడి సరుకుల రేట్లు భారీగా పెరగడంతో సిమెంట్ ప్రొడక్షన్ ఖర్చు ఎక్కువైందని చెప్పారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం వల్ల కూడా కోల్, ఆయిల్ సరఫరాలపై పడిందన్నారు. ఇండియా సిమెంట్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రస్తావిస్తూ, వాల్యూమ్ కొద్దిగా పెరిగి 90.70 లక్షల టన్నులకు చేరిందని, సొంత ఫ్యాక్టరీలలో కెపాసిటీ యుటిలైజేషన్ 58 శాతానికి పెరిగిందని శ్రీనివాసన్ వెల్లడించారు.