IND vs ENG: ఆటగాళ్లకు కొత్త కష్టాలు.. పీకల మోతతో దద్దరిల్లుతున్న లక్నో స్టేడియం

IND vs ENG: ఆటగాళ్లకు కొత్త కష్టాలు.. పీకల మోతతో దద్దరిల్లుతున్న లక్నో స్టేడియం

ఓవైపు హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంటే, మరోవైపు అభిమానులు చిన్నపిల్లల్లా పీకలు ఊదుతూ మోత మోగిస్తున్నారు. ఈ ఘటన లక్నో వేదికగా భారత్- ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో చోటుచేసుకుంది. సౌండ్ దెబ్బకు ఆటగాళ్లు ఏకాగ్రత కోల్పోతున్నారట. ఈ ఘటనపై ఇరు జట్ల ప్లేయర్లు అసహనం వ్యక్తం చేసినట్లు కథనాలు వస్తున్నాయి.

ALSO READ : ఎమ్మెల్యే హరిప్రియానాయక్ను నిలదీసిన ప్రజలు

ఇక మ్యాచ్ విషయాన్నికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(87), సూర్యకుమార్‌ యాదవ్‌ (49) పర్వాలేదనిపించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతోంది. 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత పేసర్లు బుమ్రా, షమీ పోటీపడి వికెట్లు తీస్తున్నారు.