కేప్టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండు రోజులకే ముగిసేలా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 55 పరుగులకు ఆలౌట్ కాగా.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో ఉన్న టీమిండియా.. చివరి సెషన్ మొదలైన తొలి 8 ఓవర్లలోనే మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 11 బంతుల్లో మ్యాచ్ తలకిందులైపోయింది. చూస్తుండగానే భారత తొలి ఇన్నింగ్స్ ముగిసింది.
తిప్పేసిన ఎంగిడి, రబాడ
సఫారీ పేసర్లు లుంగి ఎంగిడి, కగిసో రబాడ జోడి ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో.. కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్ప్రీత్ బుమ్రా (0) లను ఔట్ చేయగా.. రబాడ ఆ మరుసటి ఓవర్లో కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), సిరాజ్ (0), ప్రసిద్ధ్ కృష్ణ (0)లను పెవిలియన్ చేర్చాడు. టీమిండియాకు తొలి ఇన్నింగ్స్లో 98 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
First time in Test cricket history:
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 3, 2024
Team lost the last 6 wickets without scoring a single run...!!! pic.twitter.com/hNt1dJ4aVt
Innings Break!
— BCCI (@BCCI) January 3, 2024
India are bowled out for 153 runs in the first innings, with a lead of 98 runs.
Scorecard - https://t.co/j9tTnGLuBP #SAvIND pic.twitter.com/F942A4AIMY