వీడియో: ఏం ఆడుతున్నావ్.. ఇషాన్ కిషన్‌పై రోహిత్ సీరియస్

వీడియో: ఏం ఆడుతున్నావ్.. ఇషాన్ కిషన్‌పై రోహిత్ సీరియస్

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టును రెండు ఇన్నింగ్స్‌లలోనూ 200లోపే ఆలౌట్ చేసిన రోహిత్ సేన.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌పై రోహిత్ సీరియస్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తొలి ఇన్నింగ్స్‌లో జట్టు స్కోర్‌ 400 దాటిన తర్వాత డిక్లేర్‌ చేద్దామని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావించాడు. అనుకున్నట్లుగానే జట్టు స్కోర్ 400 పరుగులు దాటింది. అయితే అప్పటికే 72 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీ సెంచరీకి చేరువ అవుతుండడంతో.. అతను అవుట్‌ అయిన వెంటనే ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేయాలని నిర్ణయానికొచ్చారు. అనంతరం కాసేపటికే 405 పరుగుల వద్ద కోహ్లీ(76) వెనుదిరగగా.. కెరీర్‌లో తొలి టెస్ట్‌ ఆడుతున్న ఇషాన్‌ను నిరాశపర్చడం ఎందుకని అతనిని క్రీజులోకి పంపారు.

ALSO READ: సెహ్వాగ్‌ రికార్డ్ బద్దలు.. టాప్ -5లోకి ఎంటరైన కోహ్లీ

క్రీజులోకి వచ్చిన కిషన్ దూకుడుగా ఆడాల్సింది పోయి.. ఒక పరుగు చేయడానికి 20 బంతులు తీసుకున్నాడు. ఈ ఆట తీరే రోహిత్ కు అసహనం కలిగించింది. క్రీజులో ఉన్న కిషన్‌ వైపు చూస్తూ.. 'ఏం ఆడుతున్నావ్‌? ఒక్క పరుగు చేయడానికి ఇంతసేపా..' అంటూ అసహనం వ్యక్తం చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ట్రినిడాడ్ వేదికగా జూలై 20 నుంచి ప్రారంభం కానుంది.