భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన మైలురానియి అందుకున్నారు. వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో 76(182 బంతుల్లో) పరుగులు చేసిన కోహ్లి.. టెస్టుల్లో టాప్ 5 భారత బ్యాటర్ల జాబితాలోకి చేరారు. ఈ మ్యాచ్ కు ముందు టెస్టుల్లో 8503 పరుగులతో సెహ్వాగ్ ఐదో స్థానంలో ఉండగా.. కోహ్లీ ఆ మైలురాయిని దాటేశారు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(15921), రాహుల్ ద్రావిడ్(13265), సునిల్ గవాస్కర్(10122), వీవీఎస్ లక్ష్మణ్(8781) కోహ్లీ కంటే ముందువరుసలో ఉన్నారు.
Virat Kohli surpassed former Indian opener Virender Sehwag in most Test runs for India. pic.twitter.com/LgTHBDOjqF
— CricTracker (@Cricketracker) July 14, 2023
కాగా, వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి టెస్టులోనే 171 పరుగులతో భారీ స్కోరుకు పునాది వేసిన యశస్వి జైస్వాల్ ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అందుకున్నారు.