చైర్మన్స్థానాలను చేవెళ్ల జనరల్, శంకర్పల్లి జనరల్, ఇబ్రహీపట్నం జనరల్, మొయినాబాద్ఎస్సీ జనరల్, షాద్ నగర్ బీసీ జనరల్, ఆమనగల్ జనరల్కు కేటాయించారు. చేవెళ్లలో 16 వ వార్డు నుంచి పోటీ చేసి విజయం సాధించిన సమత వెంకట్ రెడ్డి, మొయినాబాద్లో 25 వార్డులో జనరల్ మహిళా స్థానం నుంచి గెలుపొందిన షాబాద్ సోనియా దర్శన్(ఎస్సీ)ను చైర్పర్సన్ అభ్యర్థులుగా పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ రెండు స్థానాలు జనరల్అయినా మహిళలకు అవకాశం ఇస్తుండడం విశేషం.
శంకర్పల్లి చైర్మన్అభ్యర్థిగా ప్రచారం జరిగిన ధర్మన్నగారి వెంకట్ రెడ్డి 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. దీంతో 15వ వార్డు నుంచి గెలిచిన మాజీ చైర్ పర్సన్విజయలక్ష్మి భర్త సాత ప్రవీణ్ కుమార్, 12వ వార్డు నుంచి గెలిచిన దండు రాజేశ్వర్, షాద్ నగర్లో 14 వార్డు నుంచి అందె మోహన్, 23వ వార్డు నుంచి గెలిచిన అగ్గనూరు భశ్వేశ్వర్ చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమన్గల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున 5వ వార్డు నుంచి గెలిచిన పాపిశెట్టి రామకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్చేసింది. ఇబ్రహీంపట్నంలో టేకుల సుదర్శన్ రెడ్డి, ఆకుల యాదగిరి, జెర్కోని మమత రాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
