
- స్వతంత్ర అభ్యర్థి ఆకాశ్ భాటి ఆరోపణ
- రీకౌంటింగ్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
పంజాగుట్ట, వెలుగు : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ) స్టూడెంట్ యూనియన్ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు స్వతంత్ర అభ్యర్థి ఆకాశ్భాటి ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆదివారం ఆయన మాట్లాడారు. గత నెల 25న ఎన్నికలు జరగగా, మొత్తం 5,165 ఓట్లకు 4,065 ఓట్లు పోల్ అయినట్లు చెప్పారు. ఆ మరుసటి రోజు చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఏఎస్ఏ, బీఎస్ఎఫ్, డీఎస్యూ, ఎస్ఎఫ్ఐ యూనియన్ల మద్దతుతో ఉమేశ్ అంబేద్కర్కు1,313, తనకు 1,295 ఓట్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
అయితే,18 ఓట్లు చెల్లనివి ఉన్నాయని, తాము అభ్యంతరం చెప్తే ఈ నెల 2న రీకౌంటింగ్ నిర్వహించారన్నారు. అందులోనూ చెల్లని ఓట్లను కలిపి లెక్కింపు జరిపారని ఆరోపించారు. ఈ విషయమై తాము హైకోర్టుకు వెళ్తున్నట్లు చెప్పారు. యూనివర్సిటీకి చెందిన వారితో కాకుండా ఇతరులతో పారదర్శకంగా రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో విద్యార్థులు అభినవ్, సిద్ధాంత్శుక్లా ఉన్నారు.