ఇండియా కూటమికి తనపై పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదు : కంగనా

ఇండియా కూటమికి తనపై పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదు : కంగనా

ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు ప్రముఖ నటి, మండి BJP ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిది ఫ్యామిలీ ఫస్ట్ నినాదమని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కంగనా.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండియా కూటమికి తనపై పోటీ చేయడానికి అభ్యర్థి దొరకడం లేదని కామెంట్ చేశారు. 

ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని కంగనా అన్నారు. రాజకీయాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని రాజకీయ పార్టీలకు సూచించారు. సినీ పరిశ్రమలోనూ ఫ్యామిలీ పాలిటిక్స్ చూశానని కంగనా రనౌత్ చెప్పారు.