సత్తా చాటిన ఇండియా ఆర్చర్లు

 సత్తా చాటిన ఇండియా ఆర్చర్లు

తాష్కెంట్‌‌‌‌‌‌‌‌‌‌: ఆసియా కప్‌‌‌‌ స్టేజ్‌‌‌‌–2 వరల్డ్‌‌‌‌ ర్యాంకింగ్‌‌‌‌ టోర్నీలో ఇండియా ఆర్చర్లు సత్తా చాటారు. కాంపౌండ్‌‌‌‌ కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ నెగ్గి క్లీన్‌‌‌‌ స్వీప్‌‌‌‌ చేశారు. విమెన్స్‌‌‌‌ కాంపౌండ్‌‌‌‌ ఫైనల్లో పర్నీత్‌‌‌‌ కౌర్‌‌‌‌–రాగిణి మార్కూ–ప్రగతితో కూడిన ఇండియా త్రయం 232–223తో కజకిస్తాన్‌‌‌‌పై నెగ్గి తొలి గోల్డ్‌‌‌‌ను సాధించింది. మెన్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ ఫైట్‌‌‌‌లో అభిషేక్‌‌‌‌ వర్మ–కుశాల్‌‌‌‌ దలాల్‌‌‌‌–అమిత్‌‌‌‌ 233–226తో హాంకాంగ్‌‌‌‌ను చిత్తు చేసి రెండో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫైనల్లో అభిషేక్‌‌‌‌ వర్మ–పర్నీత్‌‌‌‌ కౌర్‌‌‌‌ 157–145తో కజకిస్తాన్‌‌‌‌పై నెగ్గి థర్డ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌తో మెరిసింది. విమెన్స్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ షుటాఫ్‌‌‌‌లో రాగిణి 144–144 (10*–10)తో ప్రగతిపై నెగ్గింది. బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో పర్నీత్‌‌‌‌ 143–141తో అడెల్‌‌‌‌ జెన్‌‌‌‌బినోవా (కజకిస్తాన్‌‌‌‌)ను ఓడించింది. మెన్స్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ ఫైనల్లో అభిషేక్‌‌‌‌ వర్మ 143–143 (10*–10)తో అమిత్‌‌‌‌పై నెగ్గాడు. కుశాల్‌‌‌‌ దలాల్‌‌‌‌ 142–141తో సెర్గియో క్రిస్టిచ్‌‌‌‌ (కజకిస్తాన్‌‌‌‌)ను ఓడించి బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సాధించాడు. 

రికర్వ్‌‌‌‌లో రెండు స్వర్ణాలు

రికర్వ్‌‌‌‌లో ఇండియా రెండు గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. మెన్స్‌‌‌‌ ఫైనల్లో మ్రినాల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌–-తుషార్‌‌‌‌ షెల్కే-–జయంత్‌‌‌‌ తాలుక్‌‌‌‌దారు 5-–1 తో చైనాపై గెలిచారు. మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ ఫైనల్లో మ్రినాల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌-–సంగీతా 5–-4తో చైనాపై నెగ్గారు. మెన్స్‌‌‌‌ ఇండివిడ్యువల్‌‌‌‌ ఫైనల్లో మ్రినాల్‌‌‌‌ చౌహాన్‌‌‌‌ 2–6తో వాంగ్‌‌‌‌ బోబిన్‌‌‌‌ (చైనా) చేతిలో, విమెన్స్‌‌‌‌ ఫైనల్లో సంగీతా 3–7తో వు జియాజిన్‌‌‌‌ (చైనా) చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టుకున్నారు. టీమ్‌‌‌‌ విభాగంలో సంగీతా–మధు వెద్వాన్‌‌‌‌–తనీషా 0–6 తో చైనా చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌ను సాధించారు. ఓవరాల్‌‌‌‌గా ఈ టోర్నీలో ఇండియా 14 (7 గోల్డ్‌‌‌‌, 5 సిల్వర్‌‌‌‌, 2 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌తో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది.