సిక్కిం సరిహద్దుల్లో రెచ్చిపోయిన చైనా.. దీటుగా జవాబిచ్చిన భారత్

సిక్కిం సరిహద్దుల్లో రెచ్చిపోయిన చైనా.. దీటుగా జవాబిచ్చిన భారత్

నాతులా: సిక్కిం సరిహద్దుల్లో చైనా సైన్యం రెచ్చిపోయింది. నాతులా పాస్ దగ్గర చొరబాటుకు యత్నించింది. అయితే అలర్ట్‌‌గా ఉన్న భారత ఆర్మీ చైనా ప్రయత్నాలను దీటుగా అడ్డుకుంది. రెండు దేశాల జవాన్‌‌ల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు దేశాల జవాన్లు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 20 మంది చైనా సోల్జర్స్‌కు గాయాలయ్యాయని తెలుస్తోంది. నలుగురు భారత జవాన్‌లు కూడా దాడిలో గాయపడ్డారని సమాచారం. సుమారు మూడ్రోజుల కింద ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కంట్రోల్‌‌లోనే ఉందని అధికారులు అనధికారికంగా చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ మన సైనికులు చైనాను సమర్థవంతంగా అడ్డుకున్నారని పేర్కొన్నారు. గతంలో గల్వాన్ లోయలో ఇరు దేశాల జవాన్‌‌ల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే.