అఫ్గాన్‌‌లో శాంతికి కట్టుబడి ఉన్నాం

అఫ్గాన్‌‌లో శాంతికి కట్టుబడి ఉన్నాం

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌‌లో శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. అఫ్గాన్ శాంతి సంధానకర్త అబ్దుల్లాను జైశంకర్ శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా అఫ్గాన్‌‌లో శాంతి నెలకొల్పడంతోపాటు ఆ దేశ సుస్థిరత, శ్రేయస్సుకు తాము కట్టుబడి ఉన్నామని అబ్దుల్లాతో జైశంకర్ చెప్పారు. ఈ మీటింగ్‌‌లో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ వివాదాల గురించి ఇద్దరు నేతలు చర్చించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌‌లో ఈ మీటింగ్ జరిగింది.