![క్వార్టర్స్పై కన్నేసిన ఇండియా..](https://static.v6velugu.com/uploads/2023/01/hokey_dRHbrBz1tQ.jpg)
భువనేశ్వర్: హాకీ వరల్డ్కప్లో ఇండియా క్వార్టర్ఫైనల్ బెర్త్పై కన్నేసింది. గురువారం వేల్స్తో జరిగే మ్యాచ్లో భారీ తేడాతో నెగ్గి.. డైరెక్ట్గా నాకౌట్కు చేరాలని టార్గెట్గా పెట్టుకుంది. ప్రస్తుతం పూల్–డిలో ఇండియా, ఇంగ్లండ్ ఖాతాలో చెరో నాలుగు పాయింట్లు ఉన్నాయి. అయితే గోల్స్ డిఫరెన్స్ కారణంగా ఇంగ్లండ్ (5) టాప్లో ఉండగా, ఇండియా (2) సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నది. అయితే మన మ్యాచ్ కంటే ముందు ఇంగ్లండ్.. స్పెయిన్తో తలపడనుంది.
ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఓడినా, డ్రా చేసుకున్నా ఇండియాకు పెద్దగా ఇబ్బందిలేదు. కేవలం వేల్స్పై విజయం సాధిస్తే డైరెక్ట్గా క్వార్టర్స్ బెర్త్ లభిస్తుంది. ఒకవేళ ఇంగ్లండ్.. స్పెయిన్ను ఓడిస్తే, అప్పుడు ఇండియా.. వేల్స్పై కనీసం ఐదు గోల్స్ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది. మొత్తానికి ఇంగ్లండ్ విక్టరీ మార్జిన్పై ఇండియా గోల్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది.