ఢాకా: సౌత్ ఏషియా ఫుట్బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్19 విమెన్స్ చాంపియన్షిప్లో ఇండియా విమెన్స్ టీమ్ ఫైనల్ చేరుకుంది. మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో ఇండియా 4–0తో నేపాల్ను ఓడించి ఫైనల్ బెర్త్ సాధించింది. నేహా 54, 80 నిమిషాల్లో రెండు గోల్స్తో సత్తా చాటగా.. సులంజన రౌల్ (85వ ని), సిండీ కోల్నీ (90+3వ ని) చెరో గోల్ చేశారు. గురువారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య బంగ్లాదేశ్తో ఇండియా పోటీ పడనుంది.