దాయాది పై మరో కొరడా: పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం ట్యాక్స్ పెంపు

దాయాది పై మరో కొరడా: పాకిస్తాన్ వస్తువులపై 200 శాతం ట్యాక్స్ పెంపు

పుల్వామా దాడి జరిగిన తరువాత పాకిస్తాన్ ను ఒంటరి చేయడానికి భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా.. పాక్ నుండి దిగుమతి అవుతున్న వస్తువులపై 200 శాతం ట్యాక్స్ ను పెంచుతూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే మోస్ట్ ఫెవర్డ్ నేషన్ హోదానుంచి పాకిస్తాన్ ను తొలగించింది ఇండియా.

భారత్ నుంచి పాకిస్తాన్ కు దిగుమతి అవుతున్న వస్తువులు: పత్తి, రంగులు, రసాయనాలు, కూరగాయలు, ఇనుము, స్టీల్‌.

పాకిస్తాన్ నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న వస్తువులు: పండ్లు, సిమెంట్‌, తోలు, రసాయణాలు, సుగంధ ద్రవ్యాలు.