
లండన్: భారత్ జీ20 సదస్సులను నిర్వహిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం టాప్ 20 టెర్రరిస్టుల(టీ20)కు ఆశ్రయం ఇస్తోందని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది మండిపడ్డారు. భారత్ వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారంపై దృష్టి సారిస్తుంటే.. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజాన్ని వ్యాపించేలా చేయడంపై ఫోకస్ పెట్టిందన్నారు.
ఉగ్రవాదంపై ఇండియా వైఖరిని వివరించడంలో భాగంగా బీజేపీకి చెందిన రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని ఎంపీల బృందం లండన్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడారు. "భారత్ జీ20 సమిట్కు ఆతిథ్యం ఇచ్చింది. కానీ, పాకిస్తాన్ టీ20(టాప్ 20 టెర్రరిస్టులు)లకు ఆతిథ్యం ఇస్తున్నది. ఇది పాక్ బహిరంగ విధానం. యూకేతో భారత్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి బాటలుపరుస్తోందని విమర్శించారు" అని ప్రియాంక చతుర్వేది అన్నారు.