- అన్ని దేశాలూ స్టార్టప్లకు సాయం చేయాలె
న్యూఢిల్లీ/హైదరాబాద్: గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి మెంటర్లు, ఇన్వెస్టర్లు, ఎంట్రప్రెన్యూర్లతో కూడిన ఇంటర్నేషనల్ నెట్వర్క్ అవసరమని కేంద్ర పరిశ్రమలు, ఆహార, జౌళిశాఖల మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. ఈ నెట్వర్క్ఒక బృందంగా ఏర్పడి స్టార్టప్లకు సాయం చేయాలని, ఉత్తమ విధానాలను, ఆలోచనలను అందరూ పంచుకోవాలని సూచించారు. ఆర్ అండ్ డీ కోసం కలసి పనిచేయాలన్నారు. హైదరాబాద్లో శనివారం జరిగిన స్టార్టప్20 ఎంగేజ్మెంట్ గ్రూఫ్ ఆఫ్ 20 ఇన్సెప్షన్ మీటింగ్ను ఉద్దేశించి వర్చువల్గా మాట్లాడారు. అన్ని దేశాలూ ఇన్నోవేషన్లను, స్టార్టప్లను సపోర్ట్ చేయాలని సూచించారు. దీనివల్ల ప్రపంచ సమస్యలను పరిష్కరించగల గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని అన్నారు. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్లో ఇండియాకు తగినంత ప్రాధాన్యం ఉందని, ఇన్నోవేషన్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని కామెంట్ చేశారు.
ఎంట్రప్రిన్యూర్షిప్ను పెంపొందించడంలో కొత్త కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో ఇది సహాయపడిందని మంత్రి పేర్కొన్నారు. స్టార్టప్లు వృద్ధి చెందడానికి అభివృద్ధి చెందడానికి సహాయపడిందని ఆయన అన్నారు. ఫుడ్, ఎనర్జీ, ఫిన్టెక్ వంటి రంగాల్లో ఇండియా స్టార్టప్లు సత్తా చాటాయని గోయల్ తెలియజేశారు. హైదరాబాద్లో జరిగిన సమావేశాలకు కేంద్ర వాణిజ్య,-పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్, ‘స్టార్టప్20’ బృందం చైర్మన్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్, భారత జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు.