T20 World Cup 2024: అమెరికాతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

T20 World Cup 2024: అమెరికాతో మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

టీ20 వరల్డ్ కప్ లో నేడు (జూన్ 12) భారత్ మరో అమెరికాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ గ్రౌండ్ లో ఇదే చివరి మ్యాచ్. ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గెలిచిన జట్టు సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. రెండు జట్లు కూడా వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరు మీదున్నాయి. 

ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. మరోవైపు అమెరికా ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. కెప్టెన్, వికెట్ కీపర్ మొనాంక్ స్థానంలో షాయన్ జహంగీర్.. నోస్తుష్ స్థానంలో షాడ్లీ ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించారు.