అవినీతిలో ఇండియాది 77వ ప్లేస్

అవినీతిలో ఇండియాది 77వ ప్లేస్

న్యూఢిల్లీ: బిజినెస్​పరమైన అవినీతి విషయంలో ఇండియా 77వ స్థానంలో ఉందని యాంటీ–బ్రైబరీ స్టాండర్డ్​ ఆర్గనైజేషన్ ‘ట్రేస్​’ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ఈ విషయంలో మనదేశం స్కోరు 45గా (కమర్షియల్​ బ్రైబరీ రిస్క్​) రికార్డయింది. ట్రేస్​ మొత్తం 194 దేశాల్లో స్టడీ చేసింది. దీని ప్రకారం.. నార్త్​ కొరియా, తుర్కెమిస్తాన్​, సౌత్​ సూడాన్​, వెనెజులా, ఎరిట్రియాలు అవినీతి విషయంలో ‘టాప్​–5’గా నిలిచాయి. డెన్మార్క్​, నార్వే, ఫిన్​లండ్​, స్వీడన్​, న్యూజిలాండ్​లో అవినీతి చాలా తక్కువగా ఉంది. గత ఏడాది కూడా ఇండియాకు కమర్షియల్​ బ్రైబరీ రిస్క్​ ఇండెక్స్​లో 77వ ర్యాంకే వచ్చింది. గవర్నమెంటుతో బిజినెస్​ పనులు, అవినీతిని అడ్డుకోవడం, చర్యలు తీసుకోవడం, పాలనలో పారదర్శకత, సామర్థ్యం అనే ఐదింటి ఆధారంగా ర్యాంకు ఇస్తారు. పాకిస్తాన్​, చైనా, నేపాల్, బంగ్లాదేశ్​, భూటాన్​ కంటే ఇండియాలోనే అవినీతి తక్కువని తేలింది. అయితే అవినీతిని తగ్గించేందుకు చైనా చాలా చర్యలు తీసుకుందని ట్రేస్​ బ్రైబరీ రిస్క్​ మ్యాట్రిక్స్​ రిపోర్టు వివరించింది. ఇండియాతోపాటు పెరూ, జోర్డన్, నార్త్​ మాసిడోనియా, కొలంబియా, మాంటినీగ్రో దేశాలకు 77వ ర్యాంకే వచ్చింది. ఈ స్టడీ కోసం ఇంటర్నేషనల్​ఆర్గనైజేషన్ల నుంచి సమాచారం తీసుకున్నామని ట్రేస్ తెలిపింది.