షాంఘై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–1లో ఇండియా మెన్స్ రికర్వ్ ఆర్చరీ టీమ్ గురి అదిరింది. గురువారం జరిగిన సెమీస్లో తరుణ్దీప్ రాయ్–ధీరజ్ బొమ్మదేవర–ప్రవీణ్ జాదవ్తో కూడిన ఇండియా త్రయం 5–1 (55–54, 55–55, 56–55)తో ఇటలీపై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్లో బై పొందిన ఇండియా టీమ్.. తర్వాతి రౌండ్లో 5–3 (55–56, 54–54, 55–51, 55–53)తో ఇండోనేసియాను ఓడించింది.
క్వార్టర్ఫైనల్లో 5–1(59–54, 56–55, 55–55)తో ఏడోసీడ్ స్పెయిన్పై నెగ్గి సెమీస్లోకి అడుగుపెట్టింది. మరో సెమీస్లో సౌత్ కొరియా 6–0తో చైనీస్తైపీని ఓడించింది. ఆదివారం జరిగే గోల్డ్ మెడల్ మ్యాచ్లో ఇండియా.. సౌత్ కొరియాతో తలపడుతుంది. దీపిక కుమారి–అంకితా భాకట్–భజన్ కౌర్తో కూడిన ఇండియా విమెన్స్ టీమ్ 3–5తో మెక్సికో చేతిలో ఓటమిపాలైంది. స్టార్టింగ్లో మంచి గురితో ఆకట్టుకున్న ఇండియా త్రయం 3–1 లీడ్లో నిలిచినా చివర్లో నిరాశపర్చింది.
విమెన్స్ ఇండివిడ్యువల్ కాంపౌండ్ క్వార్టర్ఫైనల్లో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ 143–142తో అవ్నీత్ కౌర్పై, ప్రియాన్షు షూటాఫ్లో బతుహాన్ అక్కాగ్గు (టర్కీ)పై నెగ్గి సెమీస్లోకి అడుగుపెట్టారు. అదితి సవాన్ క్వార్టర్స్లోనే నిష్క్రమించింది. 142–144తో అండ్రియా బెకెరా (మెక్సికో) చేతిలో ఓడింది.