
భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం ఇవాళ(బుధవారం) తిరిగి చైనాకు అప్పగించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. చుషూల్-మోల్దో మీటింగ్ పాయింట్ దగ్గర ప్రొటోకాల్ ప్రకారం చైనా సైనికుడిని అప్పగించినట్టు తెలిపింది. తప్పిపోయిన జడల బర్రెను వెతికిపెట్టాలన్న స్థానికుడి విజ్ఞప్తి మేరకు దానిని వెతుకుతూ అతడు పొరపాటున సోమవారం భారత భూభాగంలోని లడక్ లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అతడిని తిరిగి తమకు అప్పగించాలంటూ నిన్న చైనా విజ్ఞప్తి చేసింది. చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రొటోకాల్ ప్రకారం అప్పగిస్తామని తెలిపింది. అందులో భాగంగా ఇవాళ అప్పగించింది.