ఐదు నెలల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు

ఐదు నెలల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. శనివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 1,890 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పోయిన ఏడాది అక్టోబర్ 28న 2,208 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్ని కేసులు నమోదు కావడం149 రోజుల్లో ఇదే తొలిసారి అని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,433కు పెరిగిందని తెలిపింది.

దేశంలో మరో ఏగుడురు కరోనాతో చనిపోయారని, మొత్తం మృతుల సంఖ్య 5,30,831కి పెరిగిందని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం కరోనా డైలీ పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉన్నట్లు వివరించింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,47,04,147కు చేరిందని వెల్లడించింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తం 220.65 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ లు వేసినట్లు తెలిపింది.