భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు

భారత్లో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా కంట్రోల్ లోకి వస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఒక్క రోజులో 346 మంది మరణించగా.. 91,930 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల లోడ్ 4 లక్షల 78 వేల 882గా ఉందని వివరించింది.

ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 5 లక్షల 9 వేల 11 మంది మరణించగా.. 4 కోట్ల 16 లక్షల 77 వేల 641 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 172 కోట్ల 95 లక్షల 87 వేల 490 డోసులు వ్యాక్సినేషన్ పూర్తియిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరిన్ని వార్తల కోసం..

వనాల్లో అమ్మలకు జనాల పబ్బతి

నెట్‌‌‌‌ఫ్లిక్స్‌‌,  గూగుల్‌‌పై ఫైన్‌‌

ఐపీఎల్: హైదరాబాదీ ఎలక్ట్రీషియన్‌ కొడుకు కోటీశ్వరుడయ్యిండు