దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా కంట్రోల్ లోకి వస్తోంది. రోజు వారీగా నమోదవుతున్న కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా ఈ ఒక్క రోజులో 346 మంది మరణించగా.. 91,930 మంది పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. డైలీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైందని పేర్కొంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల లోడ్ 4 లక్షల 78 వేల 882గా ఉందని వివరించింది.
India reports 34,113 fresh #COVID19 cases, 91,930 recoveries, and 346 deaths in the last 24 hours
— ANI (@ANI) February 14, 2022
Daily positivity rate: 3.19%
Active cases: 4,78,882 (1.12%)
Total recoveries: 4,16,77,641
Death toll: 5,09,011
Total vaccination: 1,72,95,87,490 pic.twitter.com/5PKBU8jkCY
ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 5 లక్షల 9 వేల 11 మంది మరణించగా.. 4 కోట్ల 16 లక్షల 77 వేల 641 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 172 కోట్ల 95 లక్షల 87 వేల 490 డోసులు వ్యాక్సినేషన్ పూర్తియిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.