ఒకే రోజు 3.68 లక్షల కేసులు.. 3 లక్షల మంది డిశ్చార్జ్

ఒకే రోజు  3.68 లక్షల కేసులు.. 3 లక్షల మంది డిశ్చార్జ్

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 68 వేల 147 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య కోటి 99 లక్షల 25 వేలు దాటింది. ఇక నిన్న 3 వేల 417 మంది ప్రాణాలు కోల్పోగా..మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 లక్షల 18 వేల 959కి పెరిగింది. నిన్న 3 లక్షల 732 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ కోటి 62 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 34 లక్షల 13 వేల 642 యాక్టివ్ కేసులున్నాయి.