నింగ్బో (చైనా): ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్.ఎస్ ప్రణయ్ బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్షిప్లో బోణీ చేశారు. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 18–21, 21–14, 21–19తో గో జిన్ వీ (మలేసియా)పై గెలిచింది. ఆకర్షి కశ్యప్ 10–21, 11–21తో బుసానన్ చేతిలో ఓడగా, క్వాలిఫయర్ మాళవిక 18–21, 19–21తో సిమ్ యు జిన్ (చైనీస్తైపీ) చేతిలో కంగుతిన్నది.
మెన్స్ సింగిల్స్ లో ప్రణయ్ 17–21, 23–21, 23–21తో లు గుయాంగ్ జు (చైనా)ను ఓడించి ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు. ఇతర మ్యాచ్ల్లో లక్ష్యసేన్ 19–21, 15–21తో షి యు కి (చైనా) చేతిలో, కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో ఆంథోని సిన్సుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో, ప్రియాన్షు రజావత్ 9–21, 13–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ఓడారు. డబుల్స్లో ఎం.ఆర్ అర్జున్–ధ్రువ్ కపిల 21–23, 21–19, 24–26తో లియు యు చెన్–ఒయు యువాన్ జి (చైనా) చేతిలో, హరిహరన్–రుబన్ కుమార్ 15–21, 14–21తో ఆరోన్ చియా–సోయ్ వూయ్ యిక్ (మలేసియా) చేతిలో, విమెన్స్ డబుల్స్లో రుతపర్ణ–శ్వేతపర్ణ 8–21, 13–21తో జాంగ్ షుయ్ జియాన్–జెంగ్ యు (చైనా) చేతిలో, పుల్లెల గాయత్రి– ట్రీసా జాలీ 12–21, 11–21తో లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.