బిష్కెక్ (కిర్గిస్తాన్): ఇండియా స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, రితిక, అన్షు మాలిక్.. పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భాగంగా శనివారం జరిగిన పోటీల్లో ఫైనల్ చేరుకోవడం ద్వారా ఈ ముగ్గురూ పారిస్ బెర్త్లను కైవసం చేసుకున్నారు. విమెన్స్ 50 కేజీ సెమీస్లో వినేశ్ 10–0తో లారా గినికిజి (కజకిస్తాన్)పై నెగ్గింది.
అంతకుముందు క్వాలిఫికేషన్లో 10–0తో మిరాన్ చియోన్ (హంగేరి)పై, క్వార్టర్స్లో 2–0తో సమ్నాంగ్ డిట్ (కంబోడియా)పై వినేశ్ గెలిచింది. 57 కేజీ సెమీస్లో అన్షు మాలిక్ 11–0తో లైల్కోన్ సొబిరోవా (ఉజ్బెకిస్తాన్)పై నెగ్గింది. 76 కేజీ సెమీస్లో రితికా 7–0తో హుయ్ జు చాంగ్ (చైనీస్తైపీ)పై గెలిచింది. 62 కేజీ సెమీస్లో మాన్సి అహ్లావత్ 0–6తో గోయెన్ మంగ్ (ఉత్తర కొరియా) చేతిలో ఓడగా, 68 కేజీల్లో నిషా దహియా సెమీస్ చేరుకోలేకపోయింది.