
న్యూఢిల్లీ: బజ్రంగ్ పూనియా, వినేశ్ పోగట్, సాక్షి మాలిక్తో కూడిన ఇండియా టాప్ రెజ్లందరూ ఆదివారం జంతర్ మంతర్ వద్ద మరోసారి ధర్నాకు దిగారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్పై లైంగిక ఆరోపణలకు సంబంధించి పర్యవేక్షణ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బ్రిజ్ భూషణ్పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. లెజెండ్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఈ నెల మొదటి వారంలో బ్రిజ్పై నివేదికను గవర్న మెంట్కు అందజేసింది. కానీ ప్రభుత్వం దానిని బహిర్గతం చేయలేదు. ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ‘కమిటీ ఇచ్చిన రిపోర్ట్ కోసం మేం వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. ఫిర్యాదు చేసిన అమ్మాయిలు చనిపోయిన తర్వాత నివేదిక బయటకు వస్తుందా? బ్రిజ్పై పోలీస్ కేసు పెట్టాం. దానిపై కూడా ఎలాంటి చర్యలు లేవు’ అని వినేష్ వ్యాఖ్యానించింది.