న్యూఢిల్లీ: డిజిటల్ ట్రాన్సాక్షన్ల విషయంలో మనదేశం ప్రపంచంలోనే నంబర్వన్గా ఎదిగింది. ఈ విషయంలో టాప్–4 దేశాలను అధిగమించింది. మైగవ్ఇండియా నుంచి సేకరించిన డేటా ప్రకారం, 2022 సంవత్సరంలో 89.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రియల్ టైమ్ చెల్లింపులలో భారతదేశం ఏకంగా 46 శాతం వాటాను సాధించింది. డిజిటల్ చెల్లింపు రంగంలో స్పష్టమైన ఆధిపత్యాన్ని దక్కించుకుంది. మనదేశంలో జరిగినన్ని లావాదేవీలు మరే దేశంలోనూ జరగలేదు. 29.2 మిలియన్ల లావాదేవీలతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, 17.6 మిలియన్ల లావాదేవీలతో చైనా మూడో స్థానంలో నిలిచింది. మైగవ్ఇండియా అందించిన డేటా ప్రకారం, థాయిలాండ్ 16.5 మిలియన్ల డిజిటల్ లావాదేవీలతో నాలుగో స్థానాన్ని పొందగా, దక్షిణ కొరియా 8 మిలియన్ల విలువైన లావాదేవీలను నమోదు చేసి ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. మైగవ్ఇండియా అనేది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫారమ్. దేశవ్యాప్తంగా టెక్నాలజీల వాడకాన్ని పెంచడానికి కార్యక్రమాలు చేపడుతుంది. డిజిటల్ చెల్లింపులలో భారతదేశం మొదటిస్థానంలో ఉందని, దీనివల్ల దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో మెచ్చుకున్నారు. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ మొదటి స్థానంలో ఉండటానికి మనదేశంలో మొబైల్ డేటా అత్యంత చౌకగా లభించడం కూడా కారణమని చెప్పారు. దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్స్పర్టుల అభిప్రాయం ప్రకారం, భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగం విలువ, పరిమాణం... రెండింటిలోనూ గణనీయమైన మైలురాళ్లను సాధిస్తోంది. దేశ పేమెంట్స్ ఎకోసిస్టమ్ బలోపేతం అవుతోంది.
ఆన్లైన్ పేమెంట్స్లో అదరగొట్టాం!.. మనదేశంలో రికార్డు స్థాయిలో ట్రాన్సాక్షన్లు
- బిజినెస్
- June 11, 2023
లేటెస్ట్
- మోదీ రైతుల సంక్షేమం కోసం ఏం చేయలేదు : శరద్ పవార్
- సీఏఏ అమలు చేసి తీరుతాం..ఇది మోదీ గ్యారంటీ : మోదీ
- ఓరి దుర్మార్గుల్లారా : మెడికల్ షాపుల్లోనే నకిలీ మందులు అమ్ముతున్నారు..!
- ఫ్లోర్ టెస్ట్ జరగాల్సిందే .. ఎల్లారెడ్డి బల్దియా కేసులో హైకోర్టు
- అమిత్ షాను ప్రధానిని చేసేందుకే మోదీ ఓట్లు అడుగుతున్నారు : కేజ్రీవాల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- జగనన్న విద్యా దీవెన.. రూ.502 కోట్లు ఖాతాల్లో జమ
- Devara Fear Song: దేవర దెబ్బకి రజినీ హుకుం సాంగ్ అవుట్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- నల్లమల అడవిలో బర్రెలతో సహా యువకుడు మిస్సింగ్
- ఈ కుర్రోళ్లు మరీ అరాచకం : రన్నింగ్ ఆర్టీసీ బస్సుపై.. బైకులపై వెళుతూ రాళ్ల దాడి
Most Read News
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- త్వరలో స్థానిక ఎన్నికలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!