చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీమెంట్లో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా కీలక సవాల్కు రెడీ అయింది. బుధవారం జరిగే చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో అమీతుమీ తేల్చుకోనుంది.
బలాబలాల్లో ఇరు జట్లూ పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇండియా అజేయంగా నిలవగా.. పాక్ ఒకే మ్యాచ్లో గెలిచింది. దాంతో, ఈ మ్యాచ్ ఫలితం ఆ జట్టు సెమీస్ బెర్తుకు కీలకం కానుంది. ఇందులో గెలిస్తే నేరుగా సెమీస్ చేరుతుంది.
నాలుగో ర్యాంకర్ ఇండియా ఇప్పటికే సెమీస్ చేరినా.. గత మ్యాచ్ల్లో పలు బలహీనతలు బయట పెట్టింది. ముఖ్యంగా ప్రత్యర్థులకు ఎక్కువ పెనాల్టీలు ఇస్తున్న హర్మన్ప్రీత్ సింగ్ కెప్టెన్సీలోని హోమ్ టీమ్.. అదే సమయంలో తమకు లభిస్తున్న పెనాల్టీ కార్నర్లను సద్వినియోగం చేసుకోవడం లేదు.
పాక్తో పోరులో ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఆశిస్తోంది. ఈ మ్యాచ్లో భారీ విజయంతో నాకౌట్లో అడుగు పెట్టాలని కోరుకుంటోంది.