![ప్రజ్ఞానందకు నాలుగు, అర్జున్కు ఐదో స్థానం](https://static.v6velugu.com/uploads/2024/05/india-young-grand-masters-r-pragnananda-erigaisi-arjun-secured-fourth-and-fifth-positions_cSmDTYrsla.jpg)
వార్సా: వరల్డ్ నంబర్వన్, నార్వే గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్ల్సన్.. సూపర్బెట్ ర్యాపిడ్,బ్లిట్జ్ చెస్ టోర్నీ టైటిల్ గెలిచాడు. ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్లు ఆర్. ప్రజ్ఞానంద (19 పాయింట్లు), ఎరిగైసి అర్జున్ (18) నాలుగు, ఐదు స్థానాలను సాధించారు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో కార్ల్సన్ 26 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచాడు. చివరి 9 రౌండ్లలో వరుసగా విజయాలు సాధించిన కార్ల్సన్.. చైనీస్ గ్రాండ్ మాస్టర్ వీ యి వెన్ (25.5)ను వెనక్కి నెట్టాడు. జాన్ క్రిస్టోఫ్ డుడా (పోలెండ్, 19.5) మూడో ప్లేస్లో నిలవగా, ఇండియాకే చెందిన డి. గుకేశ్ (12.5) పదో ప్లేస్తో సరిపెట్టుకున్నాడు.