
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్పై భారత ఆర్మీ చీఫ్జనరల్ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్పై భారత్చెస్ ఆట ఆడిందని అన్నారు. చెస్ ఆటలోలాగా శత్రువు వ్యూహాలు తెలియకుండానే ముందుకెళ్లామని, శత్రుదేశం ఎత్తుకు పైఎత్తు వేస్తూ.. సమయానుకూలంగా గట్టి దెబ్బకొట్టామని చెప్పారు. ఈ పరిస్థితిని గ్రేజోన్ అంటారని వివరించారు. ఇటీవల తమిళనాడులోని ఐఐటీ మద్రాస్లో ఆపరేషన్ సిందూర్పై ఉపేంద్ర ద్వివేది మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఈ ఆపరేషన్ను ప్రభుత్వం, భారత సైన్యం ఎంతో వ్యూహాత్మకంగా అమలు చేశాయని వెల్లడించారు.
శత్రువు అంచనా వేయలేని విధంగా దెబ్బకొట్టామని, పాకిస్తాన్, పీఓకేలో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిపామని తెలిపారు. ఆపరేషన్సిందూర్ టెస్ట్క్రికెట్లా నాలుగు రోజుల్లో నిలిచిపోయినా.. ఇది దీర్ఘకాలిక సంఘర్షణ కావొచ్చని అభిప్రాయపడ్డారు. యుద్ధం మళ్లీ ఎప్పుడైనా జరగొచ్చని, దానికి మనం సిద్ధంగా ఉండాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్సమయంలో కేంద్రం సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చిందని ఉపేంద్ర ద్వివేది తెలిపారు. మన దేశ పౌరులపై దాడిచేసిన ఉగ్రవాదులను అంతం చేసేందుకు త్రివిధ ధళాలు అనుమతి కోరిన వెంటనే ప్రధాని మోదీ, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఓకే చెప్పారని పేర్కొన్నారు.