![పేమెంట్స్ ఆటోమేషన్ పెరుగుతోంది.. అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వే వెల్లడి](https://static.v6velugu.com/uploads/2023/11/indian-businesses_uAGrnd7i8K.jpg)
న్యూఢిల్లీ : దేశంలో పేమెంట్స్ సిస్టమ్ ఆటోమేషన్ జోరందుకుంటోందని ఒక సర్వే వెల్లడించింది. 84 శాతం బిజినెస్లు పార్షియల్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ద్వారా సప్లయర్లకు పేమెంట్స్ జరుపుతున్నట్లు తమ సర్వేలో తేలిందని అమెరికన్ ఎక్స్ప్రెస్సర్వే పేర్కొంది. సెంటర్ ఫర్ ఎకనమిక్స్ అండ్ బిజినెస్ రిసెర్చ్ (సీఈబీఆర్) తో కలిసి 513 బిజినెస్లపై ఈ సర్వే నిర్వహించారు.
సర్వేలో సోల్ ప్రొప్రయిటర్బిజినెస్లు, మైక్రో బిజినెస్లు, స్మాల్ అండ్ మీడియం బిజినెస్లతోపాటు, పెద్ద బిజినెస్లు కూడా ఉన్నాయని అమెరికన్ ఎక్స్ప్రెస్ వివరించింది. బిజినెస్లు తమ పేమెంట్స్ విధానాలను పూర్తిగా ఆటోమేట్ చేసుకోని 34 శాతం బిజినెస్లను వారి భాగస్వాములు ఆటోమేట్ చేసుకోమని కోరుతున్నట్లు సర్వేలో వెల్లడైందని తెలిపింది. పేమెంట్స్సిస్టమ్ను పూర్తిగా ఆటోమేట్ చేసుకున్న బిజినెస్లలో 58 శాతం బిజినెస్లు తమ ఇన్వాయిసింగ్ యాక్యురేట్గా ఉంటోందని, వేగం పెరిగిందని చెప్పినట్లు అమెరికన్ ఎక్స్ప్రెస్ సర్వేలో తేలింది.