వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో భాగంగా ఇండియా క్రికెటర్లు నెట్ బౌలర్లుగా తమ జట్టులో చేరాలంటూ నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.. డచ్ టీమ్ ఈ నెల 20 నుంచి 24 వరకు కర్నాటకలోని ఆలూర్లో ఐదు రోజుల క్యాంప్లో పాల్గొననుంది. ఈ టైమ్లో తమకు ఒక లెఫ్టార్మ్ సీమర్, రైటార్మ్ సీమర్, ఓ మిస్టరీ స్పిన్నర్, మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ కావాలని కోరుతోంది. తమ వరల్డ్ కప్ టీమ్ నెట్ బౌలర్ కావడానికి ప్రమాణాలను సైతం వెల్లడించింది.
నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డు విడుదల చేసిన ప్రకటన ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వరల్డ్ కప్ లో తాము ప్రాక్టీస్ చేసుకోవడానికి భారత భారత బౌలర్లు కావాలంటూ ఊహించని రీతిలో ప్రకటన జారీ చేసింది. ఆసక్తి ఉన్న బౌలర్లు కనీసం ఒక ఓవర్ బౌలింగ్ చేసిన వీడియోను తమకు పంపాలని కోరింది. కాగా.. స్థానిక రాష్ట్ర క్రికెట్ సంఘాలు పర్యటక జట్లకు నెట్ బౌలర్లను ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తమకు ఒక ఎడమచేతి వాటం పేసర్, కుడిచేతి వాటం పేసర్ లతో పాటుగా.. మిస్టరీ స్పిన్నర్, ఎడమచేతి వాటం స్పిన్నర్ కావాలంటూ ఈ ప్రకటనలో తెలిపింది.