న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) తయారీ ప్లాంట్ను పెట్టే ఆలోచనలో ఉన్న తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్ను ఆకర్షించేందుకు ఇండియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇండియన్ డెలిగేషన్ తైవాన్ వెళ్లి కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్లతో చర్చలు జరుపుతున్నారు. దేశంలో ప్లాంట్ ఏర్పాటు చేయడంతో వచ్చే ప్రయోజనాలను వివరించారని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. ఈవీ ప్రొడక్షన్లో కీలకమైన లిథియం, నికెల్, మాంగనీస్, కోబాల్ట్ వంటి కీలక మినరల్స్ రిజర్వ్ల గురించి కూడా చర్చల్లో మాట్లాడారని తెలిపింది.
ఈవీ మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్కు సంబంధించి ఫాక్స్కాన్ ఎగ్జిక్యూటివ్లు కిందటేడాది ఇండియాలో పర్యటించారు. మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులు వీరితో అప్పుడు చర్చలు జరిపారు. మరోవైపు నెల కిందట తెలంగాణలోని కొంగర కొలన్లో ఫాక్స్కాన్ తన కొత్త ప్లాంట్కు శంకుస్థాపన చేసింది. ఈ ప్లాంట్లో ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్లు తయారు చేయనున్నారు. ఈ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ దిగ్గజం ఆటో ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతోంది. ఇందుకోసం ఈవీ ప్లాంట్ పెట్టే ఆలోచనలో ఉంది.