
న్యూఢిల్లీ: సూపర్ ఫామ్లో ఉన్న ఇండియా డబుల్స్ షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో తమ ర్యాంక్ను మరింత మెరుగు పరుచుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ మంగళవారం విడుదల చేసిన జాబితాలో అశ్విని–తనీషా విమెన్స్ డబుల్స్లో నాలుగు స్థానాలు మెరుగై వరల్డ్ 24వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ జంట 19వ ర్యాంక్లో మార్పు లేదు. మెన్స్ సింగిల్స్లో లక్ష్యసేన్ 18 నుంచి 17వ ర్యాంక్కు చేరగా, హెచ్ఎస్ ప్రణయ్ 8వ, శ్రీకాంత్ 24వ ర్యాంక్ల్లో కొనసాగుతున్నారు. విమెన్స్లో పీవీ సింధు 12వ ర్యాంక్లో నిలిచింది. మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి రెండో ర్యాంక్లో మార్పు లేదు.