న్యూఢిల్లీ: గ్లోబల్గా పరిస్థితులు సానుకూలంగా లేకపోయినప్పటికీ, మన ఎకానమీ మెరుగైన పనితీరుతో దూసుకెళ్తోందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మెంబర్ ఆశిమా గోయెల్ చెప్పారు. మోదీ ప్రభుత్వ హయాంలో అన్ని కీలక మాక్రో ఎకనమిక్ ఇండికేటర్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. దేశపు పూర్తి సామర్ధ్యం బయటపడటానికి చాలా దూరమే ప్రయాణించాల్సి ఉందని పేర్కొన్నారు. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్పై అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎక్కువగా రియాక్ట్ అయిందని,
Also Read : - నార్కట్పల్లి మండలంలో టెట్ బాగా రాయలేదని మహిళ సూసైడ్
దానికి కరప్షన్ స్కాండల్స్ తోడవడంతో ఎకానమీ బలహీనపడిందని గోయెల్ వెల్లడించారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చేప్పటికి ఎకానమీ ఒకవైపు ఫిస్కల్ డెఫిసిట్తో, మరోవైపు అధిక కరెంట్ అకౌంట్డెఫిసిట్తో సతమతమవుతోందని చెప్పారు.
అప్పట్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగానే ఉండేదని, బ్యాంకులు బలహీనమయ్యాయని ఆమె వివరించారు. ఈ పరిస్థితులన్నీ ఆ తర్వాత 9 ఏళ్లలో బాగా మెరుగైన విషయాన్ని గోయెల్ ప్రస్తావించారు. ఇప్పుడు గ్లోబల్గా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా, మన ఎకానమీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని పేర్కొన్నారు. ఎకనమిక్ గ్రోత్ను ఇండియా ఎక్కువ చేసి చూపిస్తోందనే కొంత మంది అమెరికన్ ఎకానమిస్టుల అనుమానాలను గోయెల్ కొట్టిపారేశారు. అన్ని రకాల డేటా ఇండికేటర్లు ఎకానమీ గ్రోత్ను ప్రతిఫలిస్తున్నాయని చెబుతూ, కరోనా తర్వాత మన ఎకానమీ రికవరీ అమెరికాలోని కొంత మంది ఎకనమిస్టుల అంచనాలను తలకిందులు చేసిందని పేర్కొన్నారు.