ఈ నెల 28–30 న ఐజీబీసీ ప్రాపర్టీ షో
హైదరాబాద్, వెలుగు : పర్యావరణానికి మేలు చేసేలా బిల్డింగ్ల నిర్మాణాన్ని ప్రొత్సహిస్తున్న ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ)ఈ నెల 28,29,30 తేదీల్లో సిటీలో ప్రాపర్టీ షోని నిర్వహించడానికి రెడీ అవుతోంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ షో జరగనుంది. దేశంలో ఇలాంటి ఈవెంట్ జరగడం ఇదే మొదటిసారి అని, ఈ ఎగ్జిబిషన్లో ఐజీబీసీ స్టాండర్డ్స్కు తగ్గట్టు ఉన్న రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్లను మాత్రమే ప్రదర్శిస్తామని సంస్థ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. డెవలపర్లతో పాటు ఆర్కిటెక్చర్లు, డిజైనర్లు, మెటీరియల్స్ను సప్లయ్ చేసేవాళ్లు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపింది. ఈ ప్రాపర్టీ షోని మంత్రి కేటీఆర్ ప్రారంభించే అవకాశం ఉందని ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి అన్నారు. 4,200 చదరపు మీటర్ల ప్లేస్ను గ్రీన్ ప్రాజెక్ట్లను ప్రదర్శనకు కేటాయించామన్నారు. సుమారు 75 ఎగ్జిబిటర్లు పాల్గొంటారని తెలిపారు.