మసూద్ను పాక్ సైన్యం దాచింది

మసూద్ను పాక్ సైన్యం దాచింది

లాహోర్: జైషే మహ్మద్​ టెర్రరిస్ట్​ మసూద్​ అజహర్ పాకిస్తాన్​లో బహవల్​పూర్​లోని ఓ ఇంట్లో సేఫ్​గా ఉన్నాడని మన ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మసూద్​ పరారీలో ఉన్నాడన్న పాక్​ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చాయి.  పారిస్​లో జరుగుతున్న టెర్రర్​ వాచ్​డాగ్​ ఫైనాన్సియల్​ యాక్షన్​ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) మీటింగ్​నేపథ్యంలోనే మసూద్​ను పాక్​ ఆర్మీ, ఐఎస్ఐ దాచిపెట్టిందని ఆరోపించాయి. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. మసూద్​ అజహర్, అతని కుటుంబాన్ని పాక్​ ఆర్మీ అత్యంత కట్టుదిట్టమైన సెక్యూరిటీ మధ్య బహవల్​పూర్​ తరలించింది. అక్కడ జైషే మహ్మద్​ ఏర్పాటు చేసుకున్న కొత్త హెడ్​క్వార్టర్స్ లో మసూద్​ను దాచిపెట్టింది. సెక్యూరిటీ కోసం భారీగా బలగాలనూ మోహరించింది.

మసూద్  మా​దేశంలో లేడు..

జైషే చీఫ్ మసూద్​ అజహర్​ కనిపించడంలేదని, దేశం విడిచి పారిపోయాడని పాక్​ ఆర్థిక మంత్రి హమద్​ అజహర్​ సోమవారం చెప్పారు. మసూద్​ మిస్సింగ్​ నేపథ్యంలో పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్​ నమోదు చేయలేకపోయారని అన్నారు. అయితే, ఎఫ్ఏటీఎఫ్​ కీలక మీటింగ్​ నేపథ్యంలోనే పాకిస్తాన్​ ఈ కొత్త వాదన తెరపైకి తెచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనీలాండరింగ్, టెర్రర్​ ఫైనాన్స్ విషయంలో ఎఫ్ఏటీఎఫ్​ గైడ్​లైన్స్ పాటిస్తున్నట్లు కలరింగ్​ ఇవ్వడానికి పాక్​ ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మసూద్​ అజహర్.. అరెస్టు, విడుదల

1994… ఫేక్​ ఐడెంటిటీతో ప్రయాణిస్తున్న మసూద్​ అజహర్​ను కాశ్మీర్​లోని అనంత్​నాగ్​ జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు.

1995.. మసూద్​ను విడిపించడం కోసం టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్​లో ఆరుగురు ఫారెనర్ల టీంను కిడ్నాప్​ చేశారు. అందులో ఇద్దరు బయటపడగా.. మిగతా నలుగురి జాడ తెలియలేదు.

1999… నేపాల్​ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఇండియన్​ ఎయిర్​లైన్స్ విమానాన్ని టెర్రరిస్టులు హైజాక్​ చేశారు. సయీద్​తో పాటు మరో ముగ్గురిని విడుదల చేయాలని డిమాండ్​ చేశారు. అప్పట్లో తాలిబన్ల అధీనంలోని కాందహార్‌కు విమానాన్ని మళ్లించారు. విమానంలోని ప్రయాణికులను విడిపించేందుకు ఇండియన్​ గవర్నమెంట్​ సయీద్​ను విడుదల చేసింది.

మసూద్​ విడుదల తదనంతర పరిణామాలతో హర్కతుల్​ అన్సర్​ సంస్థను అమెరికా బ్యాన్డ్ టెర్రరిస్ట్​ ఆర్గనైజేషన్స్ లిస్టులో చేర్చింది. దీంతో హర్కతుల్​ అన్సర్​ పేరును హర్కతుల్​ముజాహిదీన్​గా మార్చారు. మసూద్​  అజహర్​ మరో కొత్త సంస్థను ‘జైషే మహ్మద్’ పేరుతో స్థాపించాడు. పాక్‌ఐఎస్ఐ మసూద్​కు సాయం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.

2001లో జైషే మహ్మద్ టెర్రరిస్టులు​ఇండియన్​ పార్లమెంట్​పై అటాక్ చేశారు. ఈ దాడిలో లష్కరే తోయిబా సాయం కూడా తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాడిలో పాల్గొన్న ఐదుగురు టెర్రరిస్టులను ఢిల్లీ పోలీసులు కాల్చేశారు. ఆరుగురు పోలీసులు కూడా ఈ దాడిలో చనిపోయారు. పార్లమెంట్​ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి తర్వాత వచ్చిన విమర్శలు, ఇండియాతో పాటు అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడితో పాక్​ ప్రభుత్వం మసూద్​ను అరెస్టు చేసింది.

2008లో జరిగిన ముంబై అటాక్స్​లో, 2016లో జరిగిన పఠాన్​కోట్​ అటాక్ లతో పాటు  గతేడాది జరిగిన పుల్వామాఅటాక్​లోనూ మసూద్​ సయీద్, జైషే మహ్మద్​ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. మన సర్కార్‌తగిన ఆధారాలు ఇచ్చినా పాక్​ ప్రభుత్వం మసూద్​పై చర్యలు తీసుకోలేదు. ఎప్పటికప్పుడు మసూద్​ పరారీలో ఉన్నాడని వాదిస్తోంది. మసూద్​ను గ్లోబల్​ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది.