కోల్కతా: అబ్బాయిది బెంగాల్లోని నదియా జిల్లా బల్లవపూర్. అమ్మాయిది బంగ్లాదేశ్లోని నెరైల్ఏరియా. ఫేస్బుక్ పరిచయం ప్రేమకు దారితీసింది. కొంతకాలంగా ఒకరినొకరు లవ్ చేసుకుంటున్న ఈ జంట పెండ్లి చేసుకోవాలనుకున్నారు. అబ్బాయి జయికంటో చంద్రరాయ్(24) బంగ్లాదేశ్ వెళ్లడానికి ప్లాన్వేశాడు. మార్చి10న ‘అప్పు’ అనే ఓ బ్రోకర్ హెల్ప్తో అక్రమంగా ఇండియా–బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటాడు. మార్చి10న అమ్మాయి(18)ని అక్కడే పెళ్లి చేసుకొని ఈ నెల 26 వరకు అక్కడే ఉన్నాడు. తర్వాత అమ్మాయితో ఇండియా రావడానికి లోకల్దళారికి 10 వేల బంగ్లాదేశ్కరెన్సీ ఇచ్చాడు. మధుపూర్ సరిహద్దుల వద్ద ఇద్దరు బార్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇంటెలిజెన్స్వర్గాలు 82వ బెటాలియన్ ట్రూప్స్కు ఇన్ఫర్మేషన్ఇచ్చాయి. దీంతో ఈనెల 26న భద్రతా బలగాలు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశాయి. విచారిస్తే అబ్బాయి ఐడెంటిటీ వివరాలు సరిగానే ఉన్నా.. అమ్మాయివి లేవు. దీంతో బీఎస్ఎఫ్ ఆఫీసర్స్ వాళ్లను భీంపూర్ పోలీసులకు అప్పగించారు. అక్రమంగా బార్డర్ దాటినందుకు వారిపై చర్యలు ఉంటాయని 82వ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ సంజయ్ ప్రసాద్ సింగ్ వెల్లడించారు. సరిహద్దుల్లో విమెన్ ట్రాఫికింగ్ఎక్కువగా జరిగే చాన్స్ ఉందని, అమాయక అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచార రొంపిలోకి దింపుతుంటారని, ఈ ఇద్దరి విషయంలో మాత్రం అలాంటిదేమీ లేదని, వీరి ప్రేమలో నిజాయతీ ఉందని ప్రసాద్ సింగ్ పేర్కొన్నారు.