
బాకు (అజర్బైజాన్): ఇండియా షూటర్లు శివ నర్వాల్–సరభ్జ్యోత్ సింగ్–అర్జున్ సింగ్ చీమా.. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ మెడల్తో మెరిశారు. గురువారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో శివ–సరభ్–అర్జున్ 1734 పాయింట్లు సాధించి మూడో ప్లేస్లో నిలిచారు. నర్వాల్ 579, సరభ్జ్యోత్ 578, చీమా 577 పాయింట్లు నెగ్గారు. జాంగ్ బోవెన్ (587), లియు జున్హుయ్ (582), జీ యు (580)తో కూడిన చైనా త్రయం 1749 పాయింట్లతో గోల్డ్ను సొంతం చేసుకున్నారు. జర్మన్ షూటర్లు రాబిన్ వాల్టర్ (586), మైకేల్ స్కావాల్డ్ (581), ఫౌల్ ఫోరెలిచ్ (576) 1743 పాయింట్లతో సిల్వర్ను సాధించింది. ఇండివిడ్యువల్ మెడల్ కేటగిరీలో ఇండియన్ షూటర్లు టాప్–8లో చోటు సంపాదించలేకపోయారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఇండియా విమెన్స్ త్రయం ఇషా సింగ్ (572), పాలక్ (570), దివ్య (566).. 1708 పాయింట్లతో 11వ స్థానంతో సరిపెట్టుకుంది. వ్యక్తిగత విభాగంలో ఇషా 32, పాలక్ 40, దివ్య 66వ స్థానాల్లో నిలిచారు.