పాకిస్థాన్ అంజూ.. పిల్లల కోసం ఇండియా వస్తుందంట..

పాకిస్థాన్ అంజూ.. పిల్లల కోసం ఇండియా వస్తుందంట..

భారత జాతీయ మహిళ, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అనే పేరు పెట్టుకుంది. ఫాతిమా తన 29 ఏళ్ల స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకోవడానికి పాకిస్థాన్‌లోని మారుమూల గ్రామానికి వెళ్లింది. 2019లో ఫేస్‌బుక్‌లో వీరు స్నేహితులయ్యారు.

"ఫాతిమా (అంజు) వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వస్తుంది" అని ఆమె భర్త నస్రుల్లా చెప్పారు. "ఆమె మానసికంగా కలవరపడుతుంది. తన పిల్లలను మిస్ అవుతుంది. కావున ఆమెకు తిరిగి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు" అని నస్రుల్లా చెప్పారు. అంజూకి రాజస్థాన్‌లో ఉండే అరవింద్‌తో ఇంతకు ముందే పెళ్లయింది. వీరికి 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. ఆమె మానసిక ఆరోగ్యం క్షీణించడం తనకు ఇష్టం లేదని అతను ఈ సందర్భంగా చెప్పాడు. "ఆమె తన పిల్లలను కలవడానికి తన దేశానికి వెళ్లడం మంచిది" అని అతను అన్నాడు.

ALSO READ: 75 ఏండల్లో 7500 మంది ఎంపీలు..17 స్పీకర్లు పనిచేసిర్రు

పాకిస్థాన్‌లో డాక్యుమెంటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆమె తిరిగి వెళ్లిపోతుందని ఆయన చెప్పారు. "దీనికి కొంత సమయం పడుతుంది. వచ్చే నెలలో ఆమె భారతదేశానికి వెళ్లే అవకాశం ఉంది" అని అతను చెప్పాడు, వీసా మంజూరైతే ఆమె భారతదేశానికి వస్తుంది. అంజు, ఆమె భర్త ఈ సంవత్సరం ఆగస్టులో వారి వివాహం తర్వాత మొదటిసారిగా ఒక రోజు పర్యటన కోసం పెషావర్‌లో ఉన్నారు. పెషావర్‌లోని దివంగత దిలీప్ కుమార్, షారూఖ్ ఖాన్ వంటి దిగ్గజ భారతీయ చలనచిత్ర నటుల పూర్వీకుల ఇళ్లను చూడాలనే కోరికను ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేసింది.