ఇండియన్ నేవీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.
పోస్టు పేరు: ఎస్ఎస్సీ ఆఫీసర్ – ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ).
మొత్తం ఖాళీలు: 15.
ఎలిజిబిలిటీ
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ / కంప్యూటర్ ఇంజినీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / సాఫ్ట్వేర్ సిస్టమ్స్ / సైబర్ సెక్యూరిటీ / సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ & నెట్వర్కింగ్ / కంప్యూటర్ సిస్టమ్స్ & నెట్వర్కింగ్ / డేటా అనలిటిక్స్ / ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బి.టెక్, ఎం.టెక్/ ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి లేదా కనీసం 60% మార్కులతో బీసీఏ/ బీఎస్సీ/ ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్ స్థాయిల్లో ఇంగ్లిష్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థులు 2002, జనవరి 1 నుంచి 2007 జులై 1 మధ్యలో జన్మించిన వారై ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మే 16.
లాస్ట్ డేట్: జూన్ 1.
సెలెక్షన్ ప్రాసెస్: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ joinindiannavy.gov.in ను సందర్శించండి.
