
న్యూఢిల్లీ: ఇండియన్రైల్వే 20 రూపాయల చాయ్కి 50 రూపాయల ట్యాక్స్వేసిందని ఓ ప్రయాణికుడు సోషల్మీడియాలో పెట్టిన పోస్ట్వైరల్గా మారింది. తాను జూన్28న శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి భోపాల్ కు వెళ్తూ చాయ్తాగగా, దానికి ఇండియన్రైల్వే రూ.20 టీకి, రూ.50 ట్యాక్స్మొత్తం రూ.70 తన వద్ద నుంచి వసూలు చేసిందని పేర్కొంటూ.. ఆ బిల్లు ఇన్వాయిస్సోషల్మీడియాలో షేర్చేశాడు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించడంతో అది వైరల్గా మారింది. కాగా రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో రిజర్వేషన్ చేసేటప్పుడు ప్రయాణికుడు భోజనం బుక్ చేయకుండా ఉండి, ఆన్బోర్డులో ట్రెయిన్వెళ్తున్న టైమ్లో టీ, కాఫీ లేదా భోజనం ఆర్డర్ చేస్తే రూ.50 సర్వీస్ ఛార్జీ చెల్లించాలని 2018లో ఇండియన్రైల్వేస్ఓ సర్క్యూలర్ జారీ చేసింది.