న్యూఢిల్లీ : ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో ఇండియా షూటర్లు మను భాకర్, ఇషా సింగ్ సత్తా చాటారు. ఆదివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ట్రయల్స్–2 క్వాలిఫికేషన్లో భాకర్ 585, ఇషా 581 పాయింట్లతో వరుసగా టాప్–2లో నిలిచారు.
సిమ్రన్ప్రీత్ కౌర్ (577), అభింద్య (572), రిథమ్ సంగ్వాన్ (566) తర్వాతి ప్లేస్ల్లో ఉన్నారు. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీ2లో అనీశ్ 582 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. విజయ్వీర్ (580), భవేశ్ షెకావత్ (580) రెండు, మూడు ప్లేస్లో నిలిచారు.