
ఉన్నత చదువులు చదివేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చుక్కెదురైంది దాదాపు 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్కు పంపారు.
అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు అమెరికా వెళ్లగా సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్ సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన అనంతరం అధికారులు తిరిగి వారిని భారత్కు పంపారు.
అట్లాంట శాన్ఫ్రాన్సిస్కో షికాగోలో విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో భారత్కు పంపారు. అంతే కాకుండా ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు. సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పిపంపినట్లుగా తెలుస్తుంది . ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సైతం ఉన్నట్లు సమాచారం ఈ వ్యవహారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.