
బార్సిలోనా: స్పానిష్ హాకీ ఫెడరేషన్ టోర్నమెంట్లో ఇండియా విమెన్స్ టీమ్ అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 3-0తో స్పెయిన్పై గెలిచి వరుసగా రెండో విక్టరీ ఖాతాలో వేసుకుంది. ఇండియా తరఫున వందన కటారియా (22వ ని.), మోనికా (48వ ని.), ఉదిత (58వ ని.) గోల్స్ చేశారు. తొలి క్వార్టర్ నుంచే బలమైన షాట్స్తో చెలరేగిన ఇండియా.. స్పెయిన్ డిఫెన్స్పై ఎదురుదాడులు చేసింది. కచ్చితమైన పాస్లతో బాల్ను ఎక్కువ శాతం తమ ఆధీనంలో ఉంచుకుంది. స్పెయిన్ కూడా షార్ట్ పాస్లతో దూసుకుపో యినా.. ఇండియా గోల్ కీపర్ సవిత అద్భుతంగా నిలువరించింది. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు, రెండు డ్రాలతో 8 పాయింట్లు సాధించిన ఇండియా టాప్ ప్లేస్లో కొనసాగుతోంది.