ఆఖరి వన్డేలో భారత్ విక్టరీ

ఆఖరి వన్డేలో భారత్ విక్టరీ
  • ఆఖరి వన్డేలో భారత్ విక్టరీ
  • చెలరేగిన స్మృతి, హర్మన్‌ప్రీత్, మిథాలీ

వరుస ఓటమిలతో సతమతమవుతున్న భారత మహిళా టీమ్ మొత్తానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. వన్డే సిరీస్ లాస్ట్ మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఛేదించి విక్టరీ కొట్టింది. టాప్ ప్లేయర్లు మిథాలీ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇండియా నిర్ఱీత 50 ఓవర్లలో 6 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో వన్డే వరల్డ్ కప్ 2022 ఆరంభానికి ముందు కావాల్సిన ఊరట విజయాన్ని అందుకుంది భారత మహిళా టీమ్. ఏకైక టీ20తో మొదలైన కివీస్ పర్యటనలో భారత జట్టు వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడింది. వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అద్భుత విజయాన్ని అందుకుని, ద్వైపాక్షిక సిరీస్‌ను ముగించింది...  ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళా, నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 రన్స్ చేసింది. 252 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ ఆచితూచి ఆడుతూ విక్టరీ కొట్టింది. స్మృతి మంధాన 84 బాల్స్ లో 9 ఫోర్లతో 71 పరుగులు చేసి అదరగొట్టింది. వన్డేల్లో ఛేదనలో స్మృతి మంధానాకి గత 10 ఇన్నింగ్స్‌ల్లో ఇది ఏడో 50+ స్కోరు కావడం విశేషం. ఓ మ్యాచ్‌లో 49 పరుగుల వద్ద అవుటై హాఫ్ సెంచరీ మిస్ చేసుకుంది. దీప్తి శర్మ, స్మృతి మంధాన కలిసి రెండో వికెట్‌కి 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

41 బంతుల్లో ఓ ఫోర్‌తో 21 పరుగులు చేసిన దీప్తి శర్మ అవుటైన తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన కలిసి మూడో వికెట్‌కి 64 పరుగుల భాగస్వామ్యం జోడించారు. జట్టు స్కోరు 153 పరుగుల వద్ద స్మృతి మంధాన అవుటైనా హర్మన్ ప్రీత్ కౌర్, కెప్టెన్ మిథాలీ రాజ్ కలిసి నాలుగో వికెట్‌కి 72 పరుగులు జోడించి భారత జట్టును విజయ తీరాలకు చేర్చారు. కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక, గాయాలతో సతమతమవుతూ జట్టుకి దూరమవుతూ వస్తున్న ఇండియన్ టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 66 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 63 పరుగులు చేసి అవుటైంది.  ఆ తర్వాత కెప్టెన్ మిథాలీరాజ్ 66 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులు, వికెట్ కీపర్ రిచా ఘోష్ 7 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించారు. 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న భారత జట్టు, న్యూజిలాండ్‌‌లోనే మార్చి 4 నుంచి ప్రారంభమయ్యే ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో పాల్గొననుంది.