దేశంలో కరోనా డేంజర్ బెల్స్ : 5 వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా డేంజర్ బెల్స్ : 5 వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు

దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. 2025, జూన్ 5వ తేదీ ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 4 వేల 866 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 24 గంటల్లో.. కొత్తగా ఒక వెయ్యి 238 కేసులు బయటకు వచ్చాయని.. ఏడుగురు వ్యక్తులు కరోనాతో చనిపోయినట్లు స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. 

ఇదేమీ లైట్ తీసుకోవాల్సిన విషయంగా కనిపించటం లేదనే.. ప్రభుత్వ లెక్కలతోనే తెలుస్తోంది. పరీక్షలు చేయించుకోని వారు ఇంకెంత మంది ఉన్నారో.. జలుబు, దగ్గు, జ్వరంగా మామూలే కదా అంటూ ట్యాబ్లెట్లు వాడుతున్న వారు ఇంకెంత మంది ఉన్నారో అనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

 గడిచిన 24 గంటల్లో దేశంలో 1238 కొత్త కేసులు నమోదు కాగా.. ఏడుగురు మృతి చెందారు.  ప్రస్తుతానికి దేశంలో యాక్టివ్ కేసులు   4,866 కి చేరాయి. మరణించిన ఏడుగురిలో ముగ్గురు మహారాష్ట్ర కాగా  ఢిల్లీ, కర్ణాటకలలో ఒక్కొక్కరు ఉన్నారు. ఏడుగురిలో ఆరుగురు వృద్ధులు  ఉన్నారు. అయితే  మృతులకు ముందస్తుగా మధుమేహం, రక్తపోటు, న్యుమోనియా వంటి   ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పారు డాక్టర్లు. మృతి చెందిన వారిలో  ఒకరు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఐదు నెలల మగ శిశువు కూడా ఉన్నట్లు చెప్పారు..

ప్రస్తుతానికి కేరళలో 1487,మహారాష్ట్రలో 526, గుజరాత్ లో 508, ఢిల్లీలో 562,వెస్ట్ బెంగాల్ లో 538,కర్ణాటక 436, తమిళనాడు 213 యాక్టివ్ కేసులు ఉన్నాయి.