కొత్త సంవత్సరంలో మొదటి ప్రయోగాన్ని సక్సెస్తో ప్రారంభించింది ఇస్రో. 2020కి సక్సెస్తో వెల్కమ్ చెప్పింది. టెలికమ్యూనికేషన్స్ శాటిలైట్ జీశాట్30 సక్సెస్ఫుల్గా కక్ష్యలోకి చేర్చింది. శుక్రవారం తెల్లవారుజామున 2.35 గంటలకు ఏరియన్స్పేస్కు చెందిన ఏరియన్5 వీఏ251 రాకెట్, జీశాట్30ని నింగిలోకి మోసుకెళ్లింది. ఫ్రెంచ్గయానాలోని కౌరూలో ఉన్న ఏరియన్ లాంచ్ కాంప్లెక్స్ నుంచి ప్రయోగం జరిగింది. నింగికెగిసిన 38 నిమిషాల 25 సెకన్లకు జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఉపగ్రహాన్ని రాకెట్ చేర్చింది. ఇస్రో తరఫున యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ పి. కున్హి కృష్ణన్ కౌరూకు వెళ్లారు. ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఇస్రో టీంకు ఆయన అభినందనలు తెలిపారు.
శాటిలైట్ ఉపయోగాలేంటి?
ఇంతకుముందు ఇస్రో ప్రయోగించిన ఇన్శాట్/జీశాట్ సిరీస్లో భాగమే ఈ జీశాట్30 ఉపగ్రహం. ప్రస్తుతం కమ్యూనికేషన్ల కోసం నింగిలోకి పంపిన ఇన్శాట్4ఏకి రీప్లేస్మెంట్గా జీశాట్30ని ఇస్రో పంపించింది. డీటీహెచ్ టెలివిజన్ సర్వీసెస్, ఏటీఎంల కోసం వీశాట్కనెక్టివిటీ, స్టాక్ఎక్స్చేంజ్, టెలివిజన్ అప్లింకింగ్, టెలిపోర్ట్ సర్వీసెస్, డిజిటల్ శాటిలైట్ న్యూస్ గేథరింగ్ (డీఎస్ఎన్జీ), ఈ–గవర్నెన్స్ అప్లికేషన్ల కోసం జీశాట్30 సేవలు అందించనుంది. కేయూ బ్యాండ్, సీ బ్యాండ్ ఫ్రీక్వెన్సీల్లో జీశాట్30 సేవలందిస్తుంది. కేయూ బ్యాండ్ ద్వారా దేశ భూభాగంతో పాటు ఐలాండ్లలో కమ్యూనికేషన్ సర్వీసులు అందిస్తుంది. సీ బ్యాండ్ ద్వారా గల్ఫ్ కంట్రీస్తో పాటు పలు ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాల్లోనూ కమ్యూనికేషన్ సేవలు అందుతాయి.
ఈక్వేటర్కు 36 వేల కిలోమీటర్ల ఎత్తులో
ఉపగ్రహాన్ని రాకెట్ వదిలిన వెంటనే కర్ణాటకలోని హసన్ వద్ద ఉన్న ఇస్రో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ (ఎంసీఎఫ్), శాటిలైట్ను కంట్రోల్లోకి తీసుకుంది. భూమధ్య రేఖకు 36 వేల కిలోమీటర్ల ఎత్తులోకి శాటిలైట్ను చేర్చేందుకు ఎంసీఎఫ్ తర్వాతి కక్ష్య మార్పులను చేపట్టనుంది. ఉపగ్రహంలోని ప్రొపల్షన్ సిస్టమ్లను వాడుకుంటూ ఆ కక్ష్య మార్పులను చేపట్టనుంది. చివరి దశలో రెండు సోలార్ పానెళ్లతో పాటు యాంటెనా రిఫ్లెక్టర్లను ఓపెన్ చేస్తుంది.
యూరోపియన్ శాటిలైట్ కూడా
జీశాట్30తో పాటు యూటెల్శాట్ కనెక్ట్ అనే యూరోపియన్ శాటిలైట్ను ఏరియన్5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఇది కూడా జీశాట్30 లాగానే టెలికమ్యూనికేషన్ ఉపగ్రహమే. యూటెల్శాట్ కోసం థేల్స్ ఎలీనియా స్పేస్ అనే సంస్థ ఆ ఉపగ్రహాన్ని తయారు చేసింది. జీశాట్30 కన్నా ముందు ఈ ఉపగ్రహాన్నే రాకెట్ కక్ష్యలోకి చేర్చింది. రాకెట్ గాల్లోకి లేచిన 27 నిమిషాలకు దానిని నిర్దేశిత కక్ష్యలోకి పంపింది.
1981లో తొలిసారిగా
ఏరియన్ స్పేస్ సేవలను ఇస్రో తొలిసారిగా 1981లో వినియోగించుకుంది. యాపిల్ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్ ప్రయోగాన్ని ఏరియన్ ఫ్లైట్ ఎల్03 రాకెట్ ద్వారా చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పుడు జీశాట్30 దాకా ఏరియన్స్పేస్ సంస్థ ఇండియాకు చెందిన 24 శాటిలైట్లను నింగిలోకి పంపించింది.